సుశాంత్ సింగ్ మృతి కేసు క్లోజ్.. సీబీఐ కీల‌క రిపోర్ట్‌

సుశాంత్ సింగ్ మృతి కేసు క్లోజ్.. సీబీఐ కీల‌క రిపోర్ట్‌

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పూర్తిగా మూసివేసింది. సుశాంత్ మరణంలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చి చెప్పిన సీబీఐ, తమ క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టులో సమర్పించింది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఆరోపణలు, అలాగే సుశాంత్ కుటుంబంపై రియా చేసిన ఫిర్యాదు.. ఈ రెండు కేసులపై దర్యాప్తును పూర్తిచేసిన సీబీఐ, ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చింది.

ఐదేళ్ల దర్యాప్తు.. ఎలాంటి ఆధారాలు లేవన్న సీబీఐ
2020 జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, 2020లో బీహార్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆగస్టులో సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. సుశాంత్ తండ్రి ఆరోపణల మేరకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఆర్థిక మోసం, మానసిక వేధింపుల కారణంగా సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు అయింది. దీనికి ప్రతిస్పందనగా రియా కూడా సుశాంత్ సిస్ట‌ర్స్ ప్రియాంక సింగ్‌, మీతూ సింగ్ నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ సృష్టించార‌ని కౌంటర్ ఫిర్యాదు చేసింది.

అయితే, దాదాపు ఐదేళ్ల పాటు సాగిన దర్యాప్తు అనంతరం సుశాంత్ మరణంలో ఎలాంటి కుట్ర లేదని, అతను ఆత్మహత్యే చేసుకున్నాడని సీబీఐ తేల్చింది. అంతేకాకుండా, ఎయిమ్స్ వైద్య నిపుణుల నివేదిక ప్రకారం కూడా ఇది స్వయంసిద్ధ ఆత్మహత్యే అని నిర్ధారణకు వచ్చారు. సీబీఐ తమ క్లోజర్ రిపోర్టులో రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై ఎలాంటి నేరపూరిత ఆరోపణలు తేలలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ హై ప్రొఫైల్ కేసు అధికారికంగా ముగిసినట్లే.

Join WhatsApp

Join Now

Leave a Comment