ఫేమస్ సింగర్ మంగ్లీ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరపున పాటలు పాడినందుకు టీడీపీ తమతో పని చేయలేదు అని, రాజకీయ ప్రచారంలో తనను అనవసరంగా లాగుతున్నారని వాపోయారు. తన పాటలను రాజకీయ కోణంలో చూడడం, తనపై దుష్ప్రచారం చేయడం బాధ కలిగించిందని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, అది రాజకీయ నిర్ణయం కాదని, ఒక కళాకారిణిగా మాత్రమే చేసిన పని అని స్పష్టంచేశారు. రాజకీయ ముద్ర వలన చాలా అవకాశాలు కోల్పోయానని, కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకే తన హాజరు అయ్యానని మంగ్లీ తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరపున కొన్ని పాటలు పాడినా, అది పూర్తిగా కళా ప్రపంచానికి సంబంధించినదేనని వివరణ ఇచ్చారు. ఒక ఆర్టిస్ట్గా మాత్రమే పాటలు పాడానని, ఎక్కడా పార్టీ జెండా ధరించి ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ ముద్ర కారణంగా పలు అవకాశాలు కోల్పోయానని బాధ వ్యక్తం చేశారు.
నా పాటలకు రాజకీయ రంగుపులమొద్దు
2024 ఎన్నికలకు ముందు అన్ని ప్రధాన పార్టీల ప్రచార పాటలు పాడమని అడిగినా, తాను సున్నితంగా తిరస్కరించానని మంగ్లీ చెప్పారు. తాను కేవలం సంగీతాన్ని నమ్ముకొని వచ్చానని, రాజకీయాలను కాదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పాట పాడను అనడం అసత్యం అని, ఇది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరపున పాటలు పాడినందుకు టీడీపీ తమతో పని చేయలేదు అని, రాజకీయ ప్రచారంలో తనను అనవసరంగా లాగుతున్నారని వాపోయారు. తన పాటలను రాజకీయ కోణంలో చూడడం, వ్యతిరేక ప్రచారం చేయడం బాధించిందని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ఆరోపణల్లో నిజం కాదని మంగ్లీ స్పష్టంగా తెలియజేశారు.