మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

మందుబాబుల‌కు షాక్‌.. ఏపీలో లిక్క‌ర్ ధ‌ర‌లు పెంపు

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మందుబాబుల‌ను షాక్‌కు గురిచేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీలో లిక్కర్‌ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్‌ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ మేడ్‌, ఫారిన్‌ లిక్కర్‌, బీర్ ఇలా మూడు కేటగిరీలుగా సరఫరా జ‌ర‌గ‌నుంది.

ఇటీవల మద్యం అమ్మకాలపై వైన్‌షాప్ యాజ‌మాన్యాల‌కు చెల్లిస్తున్న మార్జిన్ స‌రిపోవ‌డం లేద‌ని వారంతా ఆందోళ‌న చేప‌ట్ట‌గా, ఆ మార్జిన్‌ను ప్ర‌భుత్వం 14.5 నుంచి 20 శాతం పెంచింది. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు సోమ‌వారం జారీ చేసింది.

ఎన్నికల స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వంపై లిక్క‌ర్ ధ‌ర‌ల గురించి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం సైతం అదే బాట‌లో ప‌య‌నిస్తోంది. మద్యం షాపుల యాజ‌మాన్యాల కోసం పెంచిన మార్జిన్‌తో మందుబాబుల జేబుల‌కు చిల్లులుప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మ‌ద్యం రేట్లు త‌గ్గిస్తామ‌ని చెప్పి కూట‌మి.. ప్ర‌స్తుతం హైక్ చేస్తుండ‌డంతో మందుబాబులు పెద‌వి విరుస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment