ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ సందర్భం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
భార్గవ్ తరఫున పొన్నవోలు వాదనలు
సజ్జల భార్గవ్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు అసలు విచారణకు అర్హతలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోస్ట్ పెట్టిన వారే ఫిర్యాదు చేయలేదని, మూడో వ్యక్తి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైందని వివరించారు.
కఠిన చర్యలపై కోర్టు స్టే
కేసులో ఐటీ సెక్షన్ల స్థానంలో పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని న్యాయవాది పొన్నవోలు వాదించారు. పోలీసులు దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూపించడానికి ప్రయత్నించినా, ఇది అలాంటి నేరం కాదని అభిప్రాయపడ్డారు. పొన్నవోలు వాదనలను పరిగణలోకి తీసుకుంటూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.