రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Summarize with AI

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై హైదరాబాద్‌ (Hyderabad)లోని రాయదుర్గం (Rayadurgam) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన రూపొందించిన ‘దహనం’ (‘Dahanam’) అనే వెబ్ సిరీస్‌లో తన అనుమతి లేకుండా పేరు వాడారంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజన సింహా (Anjana Simha)  ఫిర్యాదు (Case) చేయడం (Register)తో పోలీసులు కేసు నమోదు చేశారు.

మావోయిస్టుల కథాంశంతో తీసిన ఈ వెబ్ సిరీస్‌లో తన ప్రస్తావన ఉందంటూ అంజన సింహా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, వర్మ ఇంటర్వ్యూలలో తన పేరు ప్రస్తావించి, తన ఇన్పుట్స్ తీసుకున్నట్టు చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన అంజన సింహా, తన ప్రమేయం లేకుండా, అనుమతి లేకుండా తన పేరును వాడటం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. రాంగోపాల్ వర్మ తరచూ తన వివాదాస్పద కంటెంట్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ తాజా ఘటనతో ‘దహనం’ వెబ్ సిరీస్‌పై మరింత చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment