ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood)లో అగ్ర తారగా వెలుగొందిన పూజా హెగ్డే (Pooja Hegde), ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వరుస ప్లాపుల కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, తాజాగా ఒక భారీ అవకాశం లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, ఆ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో టాలీవుడ్కు దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ, అక్కడ కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే, ఇప్పుడు టాలీవుడ్కు స్ట్రాంగ్(Strong) రీ-ఎంట్రీ (Re-Entry) ఇవ్వబోతోంది.
తాజా సమాచారం ప్రకారం, మలయాళ స్టార్ (Malayalam Star) దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించబోయే స్ట్రెయిట్ (Straight) తెలుగు సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పూజా హెగ్డేతో అన్ని చర్చలు పూర్తయ్యాయని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. దుల్కర్ – పూజా కాంబోపై మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.








