ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ప్రమాదానికి గురయ్యాడు. అన్నాలెజినోవా (Anna Lezhinova)-పవన్ (Pawan) దంపతుల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ (Singapore) లో చదువుతున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి (Injuries). అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. వెంటనే మార్క్ శంకర్ను ఆస్పత్రికి (Hospital) తరలించి వైద్యం అందిస్తున్నారు.
మన్యం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అధికారిక కార్యక్రమాలు ముగించుకొని నేడు సింగపూర్ వెళ్లనున్నట్లుగా సమాచారం. అరకు నియోజకవర్గంలోని కురిడీ గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ (JanaSena Party) అధికారంగా ప్రకటించింది.