ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన 48 కి.మీ రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రాజెక్టు వివరాలు
మారుమూల గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు రూ.49.73 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. గిరిజన గ్రామాల ప్రజలకు డోలి మోతల కష్టాలు లేకుండా మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలవుతోంది.
పవన్ పర్యటన హైలైట్
నిన్న రాత్రి విశాఖపట్నం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాడిసన్ హోటల్లో బస చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.