పాక్‌ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA

పాక్‌ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA

పాకిస్తాన్‌లో అణుస్థావరాలపై భారత్ భారీ దాడులు చేసినట్లు ఇటీవల కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో టెర్రర్ క్యాంపులతో పాటు, పాకిస్తాన్‌కి చెందిన వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు వెల్లడైంది. అంతేకాదు, ఈ దాడుల్లో పాకిస్తాన్‌లోని అణుస్థావరాలు కూడా లక్ష్యంగా మారాయని, ఆ ప్రాంతాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని ఊహాగానాలు వ్యాపించాయి.

కాగా, ఈ దుష్ప్రచారంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తేల్చిచెప్పింది. పాకిస్తాన్‌లోని ఏ అణు కేంద్రం నుండీ రేడియేషన్ లీక్ జరగలేదని స్పష్టం చేసింది. గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్‌గా వ్యవహరిస్తున్న IAEA ఈ ప్రకటనతో అసత్య ప్రచారానికి చెక్ పెట్టినట్లు అయింది.

ఈ నేపథ్యంలో, భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల వ్యాఖ్యానిస్తూ.. కిరాణా హిల్స్ (Kirana Hills) ప్రాంతంపై భారత్ దాడి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్సులోని సర్గోదా (Sargodha) ఎయిర్ బేస్‌ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో భారత్ దాడి చేసిందన్న వాదనను ఆయన పూర్తిగా తిప్పికొట్టారు. ఈ విషయంలో ఏ ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఇక, భారత త్రివిధ దళాల సమావేశంలో కూడా ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. భారత్ జరిపిన దాడులు టెర్రరిస్ట్ గూళ్లను లక్ష్యంగా చేసినవేనని తెలిపారు. అదే సమయంలో అణు సామర్థ్యాలపై దాడులు జరిగినట్లు చెబుతున్న వార్తలను ప్ర‌భుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని తాము నివారించామని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) స్పందిస్తూ.. ఇలాంటి వివరణలకు ఎలాంటి ఆధారాలు లేవని, భారత్ ఎప్పుడూ శాంతియుత మార్గాన్నే అనుసరిస్తుందన్నది స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment