అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను 2026 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan Government) అధికారికంగా నామినేట్ (Officially Nominated) చేసింది. భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ “నిర్ణయాత్మక దౌత్యం, నాయకత్వం” కనబర్చారని పాక్ పేర్కొంది. అణు యుద్ధాన్ని నివారించడంలో ఆయన కీలక పాత్ర వహించారని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) మున్నీర్ (Munir) ట్రంప్ (Trump)తో వాషింగ్టన్ (Washington)లో డిన్నర్(Dinner) చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది. నామినేషన్ను అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పరిణామంపై అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది విశ్లేషకులు దీన్ని శాంతి యత్నంగా చూడగా, మరికొందరు భారతదేశాన్ని వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ట్రంప్ తనకు నోబెల్ బహుమతి రాదని ఇటీవల వ్యాఖ్యానించడం ఈ పరిణామానికి మరింత చర్చనీయాంశంగా మారింది.