ఆపరేషన్ సింధూర్: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్

ఆపరేషన్ సింధూర్: ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్

పాకిస్తాన్‌ (Pakistan)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army), నేవీ (Navy), ఎయిర్ ఫోర్స్ (Air Force) సంయుక్తంగా చేపట్టిన మెరుపు దాడులు ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ సహా పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసమ‌య్యాయి. భారత సైన్యం బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలలో క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 100కు పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఆపరేషన్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్
ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంతంతో పాకిస్తాన్ (Pakistan) ఎమర్జెన్సీ (Emergency) ప్రకటించుకుంది. సరిహద్దుల వ‌ద్ద పాకిస్తాన్ సైన్యం భారత సైన్యంపై తిరగబడినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌కు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలోని మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు వంటివి, భారత దాడులకు గురైయాయని ప్రజలను రెచ్చగొడుతూ, ప్రపంచానికి ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తత మరింత పెరిగింది. పహల్గాం దాడి తరువాత, పాకిస్తాన్ ఉగ్రవాదులను కొత్తగా శిబిరాలకు తరలించిందని సమాచారం.

మెడికల్ ఎమర్జెన్సీ
పాకిస్తాన్ దేశంలో లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను మూసివేసింది. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీని (Medical Emergency) ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ ప్రధాన ఎయిర్ పోర్టులలో హై అలర్ట్ (High Alert) ప్రకటించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్ పోర్టులను మూసివేసి, కరాచీకి విమానాలను మళ్లిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment