Operation Sindoor: పాక్‌పై భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత

Operation Sindoor: పాక్‌పై భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత

భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో శుక్రవారం రాత్రి పాకిస్తాన్‌పై భారీస్థాయిలో ప్రతీకార దాడులు జరిపింది. పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ఇది కౌంటర్‌గా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండి (Rawalpindi) ప్రధానంగా లక్ష్యంగా మారింది. అక్కడి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ (Noor Khan Air Base) పై భారీ బాంబుల దాడులు జరిగాయి. అంతేకాక, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్ (Rafiqui Air Base), చక్వాల్‌లోని మురిద్ ఎయిర్ బేస్ (Chakwal Murid Air Base)పై కూడా భార‌త్ ఆర్మీ దాడులు జరిగినట్టు సమాచారం.

రావల్పిండితో పాటు దేశ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలోనూ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ సైన్యం ఈ దాడులను ధృవీకరించింది. “దీనికి తగిన ప్రతీకారం ఉంటుంది” అని పాక్ ఆర్మీ ప్రకటించింది. లాహోర్ (Lahore), సియాల్‌కోట్ (Sialkot) ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. ముఖ్యంగా లాహోర్‌లోని పాక్ ఆర్మీ డివిజన్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అక్కడి నుంచి ఆర్మీ వాహనాలు బ‌య‌టకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాక్ గగనతలం మూసివేత
ఈ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తన దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలకు గగనతలాన్ని మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్‌స్పేస్ పూర్తిగా మూసివేశారు. అబుదాబీ నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానాన్ని క్వెట్టా (Quetta) వైపు మళ్లించినట్టు సమాచారం. భారత దాడుల్లో అనేక ఎయిర్ బేస్‌లలోని సౌకర్యాలు ధ్వంసమయ్యాయి. పాక్ ఫైటర్ జెట్లు గాల్లోకి ఎగరలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment