రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్ప‌దంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్య‌ర్థులు ఆందోళ‌న చేప‌ట్ట‌గా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా-పాక్ మ్యాచ్‌కు లోకేశ్ అటెండ్ అయిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, గ్రూప్ 2 అభ్య‌ర్థులు, సామాజిక వేత్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు లోకేశ్ తీరుపై మండిప‌డుతున్నారు. కూటమిని న‌మ్మి గెలిపించిన నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా సంబంధిత శాఖ‌కు మంత్రిగా ఉంటూ దుబాయ్‌లో క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తుండ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రి లోకేశ్‌తో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఉన్నారు.

రాష్ట్రంలో గ్రూప్ 2 ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు అభ్య‌ర్థులు రోడ్ల మీద బైఠాయించి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రోస్ట‌ర్ విధానంలోని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన త‌రువాతే మెయిన్స్ ఎగ్జామ్ చేప‌ట్టాల‌ని రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం వంటి ప్రాంతాల్లో అభ్య‌ర్థులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. రోడ్ల‌పైకి వ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కూట‌మిని న‌మ్మి త‌ప్పుచేశామ‌ని ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment