ఏపీలో లేడీ అఘోరీ ర‌చ్చ‌.. అఘోరా బాబాపై సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

ఏపీలో లేడీ అఘోరీ ర‌చ్చ‌.. అఘోరా బాబాపై సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

ఆంధ్రప్రదేశ్‌లో లేడీ అఘోరీ మరోసారి సంచలనం సృష్టించింది. ఆదివారం నెల్లూరు జిల్లాలో లారీ డ్రైవర్లపై ఆగ్రహంతో విరుచుకుపడిన ఆమె, సోమవారం తణుకులో మరో రచ్చ చేసింది. చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద మూడు లారీలను అడ్డుకున్న ఘటన తర్వాత, ఇప్పుడు అఘోరా బాబా ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

రాజేష్ నాథ్ పాపాలు వెలుగులోకి..
అఘోరా బాబాగా చెప్పుకుంటున్న రాజేష్ నాథ్ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని లేడీ అఘోరీ తీవ్ర ఆరోపణలు చేసింది. సమస్యల పరిష్కారం కోసం అతని వద్దకు వెళ్లిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని ఆమె మండిపడింది. రాజేష్ నాథ్‌పై “అతని అంతు చూస్తా” అంటూ ఆగ్రహంతో రచ్చ చేసింది.

ఇదే క్రమంలో రాజేష్ నాథ్ అసభ్య చేష్టలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇద్ద‌రు మహిళలతో చేసిన అసభ్య చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం అతని వద్దకు వెళ్లిన ఓ బాధితురాలు, తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో బయటపెట్టింది. “అఘోరా పేరుతో తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు” అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment