పాస్టర్ ప్రవీణ్ (Pastor Praveen) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని పోలీసులు తేల్చారు. కాగా, ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికీ హత్యే (Murder) నని చెప్పారు. హత్య అనేందుకు అన్ని ఆధారాలు (Evidence) ఉన్నాయన్నారు. బుధవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సిట్టింగ్ జడ్జి (Sitting Judge) లేదా సీబీఐ (CBI)తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా ప్రవీణ్ కు మద్యం (Alcohol) అలవాటు లేదన్నారు. పాస్టర్ది సెల్ఫ్ యాక్సిడెంట్ (Self-Accident) అని తేల్చిన పోలీసులు.. పోస్టుమార్టం రిపోర్ట్ (Report) ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు అనేక బెదిరింపులు వచ్చాయని గుర్తుచేశారు.
పాస్టర్ మృతిపై పోలీసులు విచారణ సరిగా చేయలేదని కేఏ పాల్ ఆరోపించారు. మరో 100 మంది పాస్టర్ లను కొందరు టార్గెట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ (Vijayawada) లో ప్రవీణ్ మద్యం సేవించినట్టు తెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్ట్ (Arrest) చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు చిత్తశుద్ధి ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.