ఒక్క రూపాయికి (One Rupee) ఏం వస్తుంది? ఒక్క చాక్లెట్ వస్తుంది. లేదా మింటో ఫ్రెష్ వస్తుంది. గట్టిగా మాట్లాడితే యాచకులు కూడా రూపాయేనా.. అని ఎగా దిగా చూస్తారు. అయితే.. కేవలం 99 పైసలకే ప్రముఖ సంస్థకు విశాఖపట్నంలో 21.16 ఎకరాలను ఏపీ సర్కారు (AP Government) ఇచ్చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా దగ్గర చిల్లర వంద రూపాయలు ఉన్నాయి…. ఎంత ల్యాండ్ కొనేయొచ్చో…. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ (Journalist Zafar) ఓ వీడియో (Video) చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విశాఖపట్నం (Visakhapatnam) హిల్ 3లో కోట్లాది రూపాయలు విలువజేసే 21.16 ఎకరాల భూమిని ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రముఖ కంపెనీకి కేటాయించింది. మొత్తం భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల ఆస్తిని ఇలా పప్పుబెల్లాల్లా పంచేయడంపై ప్రతిపక్ష పార్టీలు, సామాజికవేత్తలు మండిపడ్డారు. నామమాత్రపు ధరకే విలువైన భూములు ముట్టజెప్పడం సరికాదన్న విమర్శలూ వచ్చాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గకపోగా ప్రతిపక్షాలపై రివర్స్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒప్పందం, పెట్టుబడులు పెడతామన్న హామీ మేరకు ల్యాండ్ అలకేషన్ జరిగిందని వివరణ ఇచ్చింది.

99 పైసలకే 21.16 ఎకరాలు కేటాయింపుపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు, పోస్టులు, ట్రోలింగ్ జరుగుతోంది. ఇక ప్రముఖ జర్నలిస్టు జాఫర్ తాజాగా ఓ వీడియో చేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ మత్స్యకారుడి వద్దకు వెళ్లిన జాఫర్.. ఓ రూపాయి చేతిలో పెట్టి చేపలు కావాలని అడుగుతాడు. రూపాయికి ఏం వస్తుంది సార్.. అని మత్స్యకారుడు అడుగుతాడు. 99 పైసలకే భూమి వస్తోంది… నువ్వు చేపలు ఎందుకు ఇవ్వవు అంటూ జాఫర్ చెబుతాడు.
అలాగే ఫ్రూట్స్ అమ్ముకుంటున్న వ్యాపారి వద్దకు వెళ్లి రూపాయి చేతిలో పెట్టి ఫ్రూట్స్ ఇవ్వాలంటూ జాఫర్ కోరుతాడు. రూపాయికి రావు సార్.. అంటూ పండ్ల వ్యాపారి బదులిస్తాడు. మరో చిల్లర కొట్టు వద్దకు వెళ్లి రూపాయికి ఏమొస్తుందో ఇవ్వాలని అడుగుతాడు. షాపు యజమాని పాస్ పాస్ చేతిలో పెడతాడు.. అంటే రూపాయికి ఏమీ రావని, ఏపీ ప్రభుత్వం మాత్రం రూపాయికే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టేస్తోందంటూ ఆ ప్రోమోలో జాఫర్ కూటమి ప్రభుత్వాన్ని ట్రోలింగ్ చేశాడు. కొంత మొత్తంలో చిల్లర ముందు పెట్టుకుని ఈ చిల్లరతో విశాఖపట్నం మొత్తం కొనేస్తానంటూ చెబుతాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జాఫర్ కు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Itlu Mee Jaffar Mass ట్రోలింగ్ ! 😜😜😜
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) April 23, 2025
రూ.1 కి ఒక చేప కూడా రాదు.
అదే రూపాయికి 21 ఎకరాలు వస్తున్నాయి.#jaganannamedia pic.twitter.com/nE32ZK9veH