టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు

టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు

ఎన్నిక‌లు అయిపోయాయి. మ‌రోసారి కూడా మ‌న‌దే విజ‌యం అనుకుంది వైసీపీ. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. కుర్చీ ఎక్కిన కూట‌మి స‌ర్కార్‌, వెంట‌నే వైసీపీ నేత‌లను టార్గెట్ చేసింది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దాడుల‌కు పాల్ప‌డి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ ర‌క్తం క‌ళ్ల చూసింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని, సోష‌ల్ మీడియాలో సంక‌టంగా మారార‌ని ఆ విభాగంపైనా ఉక్కుపాదం మోపి.. ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టుల‌కు పాల్ప‌డింది. జ‌గ‌న్ పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను వేల సంఖ్య‌లో అరెస్టులు చేయించింది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు కొంత వెనుక‌డుగు వేశారు. ఈ క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ ఒకే ఒక్క స్టేట్‌మెంట్ మ‌ళ్లీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు కొత్త ఊపు తెచ్చింది. అదే 2.0 మంత్రం.

తిరుప‌తిలో డిప్యూటీ మేయ‌ర్‌ ఎన్నిక నేప‌థ్యంలో కూట‌మి పార్టీల నాయ‌కులు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. వైసీపీ కార్పొరేట‌ర్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు అద్దాలు ధ్వంసం చేసి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. ఆ త‌రువాత జ‌రిగిన విజ‌య‌వాడ కార్పొరేట‌ర్ల స‌మావేశంలో పార్టీ శ్రేణుల‌నుద్దేశించి మాట్లాడుతూ ఈ సారి మీరు గ‌తంలో ఉన్న జ‌గ‌న్‌ను కాకుండా 2.0 జ‌గ‌న్‌ను చూస్తార‌ని, కార్య‌క‌ర్త‌ల‌కు ఏమైనా జ‌రిగితే స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్ప‌డంతో కార్య‌క‌ర్త‌ల్లో, సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల్లో కొత్త జోష్ వ‌చ్చింది. అంతే వ‌రుస ట్రెండ్‌ల‌తో ముందుకు దూసుకెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాఫిక్ అయింది. య్యూటూబ్‌,వెబ్ సైట్‌ల‌లో ఎక్క‌డ చూసినా ఇవే వార్త‌లు. దీంతో కూట‌మి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ముఖ్యంగా చంద్ర‌బాబు, లోకేష్ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్త‌డం మొద‌లైంది.

అంతేకాదు జ‌గ‌న్ ను ఎవ‌రు ఏమ‌న్నా వైసీపీ సోష‌ల్‌మీడియా యాక్టివిస్టులు వాళ్ల‌పై ఆధారాల‌తో ట్వీట్లు చేస్తూ ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నారు. మొన్న సంక్రాంతికి వైయ‌స్ జ‌గ‌న్ మార్క్, లైలా సినిమా, నిన్నటికి నిన్న వంశీ ప‌రామ‌ర్శ‌కు వెళ్లి అక్క‌డ మాట్లాడిన మాట‌ల వ‌ర‌కు అన్నీ ట్రెండింగే. బారికేడ్లు తోసుకుని జ‌నం రావ‌డం, చిన్నారికి ముద్దు పెట్టిన ఫోటోలు భారీగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఇవాళ గుంటూరు మిర్చియార్డ్ ప‌ర్య‌ట‌న‌లోనూ జ‌గ‌న్ వెంట జ‌నం బారులు తీరారు. మాజీ సీఎంతో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీప‌డ్డారు. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం. అయినా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న స‌జావుగానే సాగింది. అయితే ప్ర‌భుత్వం నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎలాంటి భ‌ద్ర‌త క‌ల్పించలేని త‌రుణంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లే ఒక సైన్యంలా నిలిచి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేశారు. దీన్ని బ‌ట్టిచూస్తే వైసీపీ కార్య‌క‌ర్త‌లంతా మ‌ళ్లీ యాక్టివ్ అయ్యార‌ని తెలిసిపోతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment