వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y. S. Jagan) నేడు (గురువారం) ఉమ్మడి కర్నూలు (Kurnool) జిల్లా పార్టీ నేతలతో (Leaders) తాడేపల్లి (Tadepalli) కార్యాలయంలో కీలక సమావేశం (Meeting) నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల (Nandyal) జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఈ భేటీలో పార్టీ తాజా పరిస్థితులు, రానున్న ఎన్నికల వ్యూహాలు, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తెలుసుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై పార్టీ చేయాల్సిన పోరాటంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా క్యాడర్కు సూచించినట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తెగువ చూపించిన వారిని వైఎస్ జగన్ అభినందించి (Congratulate) రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి దిశానిర్దేశం (Guidance) చేయనున్నట్లుగా తెలుస్తోంది.