రాజ్గిర్ (Rajgir)లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే పురుషుల ఆసియా కప్ (Asia Cup) హాకీ టోర్నమెంట్ (Hockey Tournament)లో భారత జట్టు (India Team) తమ నాలుగో టైటిల్(Fourth Title))ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టోర్నమెంట్ విజేత 2026లో జరగనున్న పురుషుల హాకీ ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది.
హర్మన్ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) సారథ్యంలోని 18 మంది సభ్యుల భారత జట్టులో అనుభవజ్ఞులైన మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి.
భారత జట్టు (గ్రూప్ A) జపాన్, చైనా మరియు కజకిస్తాన్లతో కలిసి గ్రూప్లో ఉంది. భారత్ తన తొలి మ్యాచ్ను ఆగస్టు 29న చైనాతో ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 7న జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్, ఒమన్ జట్లు వైదొలగగా, వారి స్థానంలో బంగ్లాదేశ్, కజకిస్తాన్ చేరాయి.