దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

Summarize with AI

కర్ణాటకలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాడు. ఉడిపి జిల్లాలోని కర్కాలకు చెందిన ఈ వ్యక్తి గత 19 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ నెల 17న ఆయన మంగళూరుకు చేరుకున్న తర్వాత, శరీరంపై దద్దుర్లు రావడం మరియు స్వల్ప జ్వరం రావడంతో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లాడు.

ఆసుపత్రి డాక్టర్లు అనుమానంతో అతని నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కి పంపించారు. పరీక్షల్లో మంకీపాక్స్ అని నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

రోగి పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2025లో దేశంలో వెలుగు చూసిన మొదటి మంకీపాక్స్ కేసు ఇదే కావడం గమనార్హం. గతేడాది ఈ వ్యాధి ఆందోళన కలిగించినప్పటికీ, ప్రస్తుతం సంబంధిత చర్యలు తీసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment