ఏపీ పంచాయతీ రాజ్ శాఖ (AP Panchayati Raj Department) ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (International Labour Day Celebrations) ఘనంగా నిర్వహించారు. మంగళగిరి సి.కె.కన్వెన్షన్ హాలులో (CK Convention Hall) మేడే ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రం, దేశానికి ఒక వరమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం (National Rural Employment Guarantee Scheme – NREGS) రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 46లక్షల 94వేల కుటుంబాలు..75లక్షల 23వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
ఎన్డీయే(NDA)లో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పథకాన్ని (Congress scheme) పొగడడం (Praising) సంచలనంగా మారింది. ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ (UPA Government) తెచ్చింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) హయాంలో తెచ్చిన ఈ పథకం.. దేశంలోనే మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభమవ్వడం విశేషం.
బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ పథకంపై ప్రశంసలు కురిపించడం ఏంటని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ తెచ్చిన పథకం రాష్ట్రాభివృద్ధికే వెన్నెముకగా మారిందని వ్యాఖ్యానించడంపై జనసైనికులు నివ్వెరపోతున్నారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు వెళ్లిపోవాలని మాట్లాడిన పవన్కు.. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ హయాంలో పురుడోసుకుందన్న విషయం తెలియదా..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు నెటిజన్లు. మోడీ సిద్ధాంతాలను భుజాన మోస్తూ.. కాంగ్రెస్ పార్టీపై ఒంటికాలుపై లేచే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పథకాన్ని పొగడడం జనసేన నేతలకే మింగుడుపడకపోవడం గమనార్హం.