కూటమి కుట్రలో మామిడి రైతు బలి.. జగన్‌ పర్యటనపై భూమన కీలక వ్యాఖ్యలు

కూటమి కుట్రలో మామిడి రైతు బలి.. జగన్‌ పర్యటనపై భూమన కీలక వ్యాఖ్యలు

చిత్తూరు (Chittoor), జూలై 5, 2025 – ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం (Coalition Government) మామిడి రైతుల (Mango Farmers)తో చెలగాటం ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhuma Karunakar Reddy) ఆరోపించారు. చిత్తూరులో ఒక రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

రైతు కుమార్ ఉదంతం, కూటమి కుట్ర:

“బిన్ లాడెన్‌పై అమెరికా దాడి చేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతు కుమార్‌ను కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు,” అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక (Karnataka)లో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించిందని, అయితే చిత్తూరులో కుమార్ (Kumar) అనే రైతు (Farmer) నష్టాలను భరించలేక తన చెట్లను నరికేశాడని తెలిపారు. దానికి ఫారెస్ట్ అధికారులు ఆయన్ను ఇబ్బందులకు గురి చేశారని, అటవీశాఖ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధీనంలో ఉందని గుర్తుచేశారు. ఒక మామిడి రైతును ఎర్రచందనం స్మగ్లర్‌గా చూపించారని ఆరోపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

జగన్ పర్యటన ఖాయం:

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని, రైతుల కోసమే వైఎస్ జగన్ (YS Jagan) బంగారుపాలెం (Bangarupalem) గ్రామానికి వస్తున్నారని భూమన స్పష్టం చేశారు. “జగన్‌ను చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్‌సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ(TDP) వారు జగన్ పర్యటన రద్దయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం,” అని భూమన ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ “ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు” అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని, ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భూమన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్ధతి మారాలని, హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌పై ఎద్దేవా:

పవన్ కళ్యాణ్ మాటలను తాము పట్టించుకోమని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. “ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదరించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు” అంటూ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment