తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట (Relief) లభించింది. రిజర్వేషన్ల (Reservations)పై ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు (Kaasam Venkateshwarlu) నాంపల్లి (Nampally) స్పెషల్ కోర్టులో వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్రెడ్డి హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, రేవంత్రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టులో కూడా రేవంత్కు ఊరట
గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో కూడా రేవంత్రెడ్డికి గత నెల (జులై 28) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రేవంత్కు వ్యతిరేకంగా ఎన్. పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ డిస్మిస్ చేసింది.
అయితే, ఈ పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పెద్దిరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం చేసిన ఏవోఆర్పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ, పెద్దిరాజుతో పాటు అతని న్యాయవాది రితేష్ పాటిల్, ఏవోఆర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.








‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు