తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన ఆస్ట్రేలియా టూర్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తారు. 15న జరుగనున్న AICC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్టానికి పెట్టుబడి ఆహ్వానించడమే లక్ష్యంగా అక్కడ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలోని వనరులు, పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని వివరించారు. సదస్సు ముగించుకొని ఈనెల 24న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
News Wire
-
01
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
02
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
03
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
-
04
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
05
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
06
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
07
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
08
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు
-
09
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదు
బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మందిపై కేసులు నమోదు. తనపై దాడి చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసులు నమోదు
-
10
కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత
విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు. ఆందోళనకు దిగిన సచివాలయ ఉద్యోగులు.మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు.








