మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) తీవ్ర అసహనం (Serious Dissatisfaction) వ్యక్తం చేశారు. సచివాలయం (Secretariat) లో మంగళవారం మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్వహించారు. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా మిగిలినవారంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై వైసీపీ (YSRCP) చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వడంలో మంత్రులు (Ministers) విఫలమవుతున్నారని క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల టీటీడీ గోశాల (TTD Goshaala) లో గోమాతల మృతి (Cows Death) అంశం హాట్టాపిక్గా మారింది. వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి (Bhuma Karunakar Reddy) ఫొటోలు విడుదల చేశారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి నుంచి టీటీడీ ఈవో వరకు తలో మాట మాట్లాడారు. గోవులపై తప్పుడు ప్రచారమని సీఎం చంద్రబాబు, దాదాపు 20కి పైగా గోవులని టీటీడీ చైర్మన్, 43 గోవులు మృతిచెందాయని టీటీడీ ఈవో (TTD EO) వేర్వేరు సమాధానాలిచ్చారు.
గోవుల మృతి అంశంలో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ విషయంపై కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు డైరెక్షన్స్ (Directions) ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తిరుమలలో గోవుల మృతిపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారని సమాచారం. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శులు (Personal Secretaries), ఓఎస్డీలు (OSDs) చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం.