‘మన పనితీరు ప్రజలు మెచ్చడం లేదు’.. చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మన పనితీరు ప్రజలు మెచ్చడం లేదు.. కలెక్టర్ల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో (Collectors Conference) ప్రభుత్వ పనితీరుపై (Government Performance) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ, ప్రజలు (People) ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకోవ‌డం లేద‌ని (Not Appreciating) ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పరోక్షంగా అంగీకరిస్తూ, ఇది ప్రభుత్వానికి హెచ్చరికగా భావించాలని అధికారులకు సూచించారు.

“మీరు బాగా చేశామని అనుకుంటున్నారు, నేనూ అలాగే అనుకుంటున్నాను. కానీ ఎండ్ అవుట్‌కమ్ (End Outcome) కనిపించడం లేదు. ప్రజలు మన పనితీరును మెచ్చడం లేదు. మనం ఏ స్టేక్‌హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్లే సంతృప్తి వ్యక్తం చేయకపోతే, ఎక్కడో లోపం ఉన్నట్టే” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌భుత్వ ప‌నితీరు బాగాలేద‌ని ప్ర‌భుత్వాధినేత అంగీక‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 18 నెల‌ల ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి ఉన్న‌ట్లుగా సీఎం స్ప‌ష్టం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కొన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, అయితే మరికొన్ని శాఖలు ఇంకా పుంజుకోలేదని సీఎం మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. శాఖల మధ్య పనితీరు తేడాలు ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే సమన్వయం, బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని అధికారులను హెచ్చరించారు.

ఇకపై ప్రభుత్వం డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్ (Data-Driven Decision Making) వైపు అడుగులు వేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా తాను వ్యక్తిగతంగా ప్రతి వారం నాలుగు గంటల పాటు డేటాను అధ్యయనం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలిపారు. భావోద్వేగాలతో కాకుండా గణాంకాలు, ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల నుంచి ప్ర‌భుత్వానికి మార్కులు ప‌డ‌తాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment