వైసీపీ సీనియర్ నేత (YSRCP Senior Leader), శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర అస్వస్థతకు (Severe Illness) గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ (Vennupotu Day) కార్యక్రమంలో భాగంగా విజయనగరం (Vizianagaram) జిల్లా చీపురుపల్లి (Cheepurupalli)లో ర్యాలీ (Rally) నిర్వహించిన బొత్స, అనంతరం వేదిక (Stage)పై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా స్పృహ (Consciousness) తప్పి కుప్పకూలిపోయారు. డీహైడ్రేషన్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, నాయకులు ఆయనను సమీపంలోని గరివిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆవైద్య పరీక్షల అనంతరం బొత్స కార్యకర్తలతో మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఆందోళన చెందవద్దని అనుచరులు కోరారు.
తప్పుడు ప్రచారంపై మండిపాటు
అయితే, ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ)(TDP) తప్పుడు ప్రచారం చేస్తోందని బొత్స అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స ఆరోగ్యం బాగోలేకపోయినా, వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా చేశారని టీడీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ ఆరోపణలను బొత్స అనుచరులు తీవ్రంగా ఖండించారు. ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని వారు మండిపడ్డారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొత్స సత్యనారాయణ పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిమానులు, కార్యకర్తలు వెల్లడించారు.
*బొత్సా సత్యనారాయణ కుప్పకూలిన వీడియో*
— Swathi Reddy (@Swathireddytdp) June 4, 2025
*బొత్సా ఆరోగ్యం బాగోలేదని చెప్పినా నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని జగన్ ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తుంది*
*ఎలాగైనా నువ్వు నిరసన తెలిపాల్సిందే అని ఒత్తిడి*
*ఆరోగ్యం బాగోక పోయినా నిరసనలో పాల్గుని, అస్వస్థతకు గురై కుప్పకూలిపోయిన బొత్సా*… pic.twitter.com/N9GMAud6aM