పాక్‌తో ఇక సిరీస్‌లు ఉండ‌వు.. BCCI కీలక ప్రకటన

పాక్‌తో ఇక సిరీస్‌లు ఉండ‌వు.. BCCI కీలక ప్రకటన

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలోని బైసారన్ (Baisaran) వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్రంగా స్పందించింది.

పాకిస్తాన్‌తో సంబంధాలు ఇక ఉండ‌వు
ఈ దాడిని ఖండిస్తూ BCCI, పాకిస్తాన్ జట్టుతో (Pakistan Cricket Team) ఇకపై ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేసింది. BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా (Debajit Saikia), ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలు పెట్టుకోవడం సరికాదని పేర్కొన్నారు. “ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము అనుగుణంగా ఉంటాం. పాకిస్తాన్‌తో ఇకపై ద్వైపాక్షిక సిరీస్‌లపై చర్చ కూడా ఉండదు. ఇదే మా స్పష్టమైన వైఖరి” అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

ICC టోర్నీల్లో మాత్రం..
అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే టోర్నీల్లో మాత్రం భారత్-పాక్ జట్లు తలపడతాయి. “ICC ఈవెంట్లలో నిబంధనల ప్రకారం భారత్ (India) పాకిస్తాన్‌తో ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ICC కూడా గమనిస్తోంది” అని BCCI ప్రకటించింది.

  • భారత జట్టు చివరిసారి 2008లో పాకిస్తాన్ పర్యటన చేపట్టింది.
  • పాక్ జట్టు 2012-13లో భారత పర్యటనకు వచ్చింది.
  • 2023లో ICC వన్డే వరల్డ్‌కప్ కోసం పాక్ జట్టు భారత్‌కు వచ్చింది.
  • కానీ, టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లలేదు. భద్రతా అంశాల దృష్ట్యా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment