బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్‌

బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. - మహేశ్ గౌడ్ డిమాండ్‌

తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. స్థాయికి త‌గిన‌ట్లుగా బండి సంజ‌య్ ప్ర‌వ‌ర్తించాల‌ని సూచించారు. మ‌హేశ్ గౌడ్‌ గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయ‌ని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు తగవన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెబుతూ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు.

మహేశ్ గౌడ్ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను కీర్తించారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ వెళ్లి సాధించిన‌ పెట్టుబడులను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివ‌రించారు. ఇది కాంగ్రెస్ పరిపాలన విజయానికి నిదర్శనం అని మ‌హేశ్‌ గౌడ్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment