ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ద‌ద్ద‌మ్మ ప‌నులు

  • కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై ఎంపీ అవినాష్‌రెడ్డి ఆగ్ర‌హం

కూటమి ప్రభుత్వంపై క‌డప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములలో పోలీసులు తనను అడ్డుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇంతలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదని కూటమి నేతలకు అర్థమైంది. అందుకే ఇలాంటి దద్దమ్మ పనులు చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.

వేముల‌లో జ‌ర్న‌లిస్టుల‌పై దాడిని ఎంపీ అవినాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జ‌ర్న‌లిస్టుల‌పై దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్యగా అభివ‌ర్ణించారు. దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment