మోడీ, చంద్రబాబు, పవన్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని (Adoni)లో ముస్లిం జేఏసీ నిర్వహించిన సభలో MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని (Prime Minister) మోదీ (Modi) నుంచి తెలుగు రాష్ట్రాల కీలక నాయకులైన చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరకు ఎవరినీ వదలకుండా తీవ్ర విమర్శలు గుప్పించారు.

మోడీ ముస్లింల ద్రోహి: ఒవైసీ ఫైర్
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ముస్లింలపై (Muslims) అన్యాయాలు అధికమయ్యాయని, ఆయన ముస్లింలకు శత్రువుగా పనిచేస్తున్నారని ఒవైసీ (Owaisi) ఆగ్రహంతో అన్నారు. ఇటీవలి అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight Accident)పై కూడా సంతాపం తెలియజేశారు.

చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌(NTR)కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించిన ఒవైసీ, ప్రస్తుతం ఆయన తనయుడు లోకేష్(Lokesh) ఎదుగుదలకే అడ్డుగా మారుతున్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి (Amaravati Development) తాము కూడా మద్దతుగా ఉంటామని తెలిపారు.

పవన్‌పై సెటైర్లు.. “నేనే పెద్ద హీరో”
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఒవైసీ, “పవన్ హీరో అయితే, నేనే అతనికంటే పెద్ద హీరో!” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి కానీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

వైసీపీకి మద్దతు గుర్తు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)పై సానుకూలంగా స్పందించిన ఒవైసీ, పార్లమెంట్‌లో MIMకు జగన్ ఎంపీలు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో, టీటీడీకి సంబంధించి తలెత్తిన వివాదాలపై చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తారు.

వక్ఫ్ బోర్డుపై ప్రశ్నలు
వక్ఫ్ బోర్డు (Wakf Board)లో అన్యమతస్తులను ఎందుకు చేర్చాలి? అని ప్రశ్నించిన ఒవైసీ, ఇది ముస్లింల హక్కులను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment