లేటెస్ట్ స‌ర్వే.. 10 నెల‌ల్లోనే కూటమికి డేంజర్ బెల్స్

లేటెస్ట్ స‌ర్వే.. 10 నెల‌ల్లోనే కూటమికి డేంజర్ బెల్స్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో 164 సీట్లు గెలిచిన కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చినా, పది నెలల పాలన (10-Month Rule) తర్వాత ప్రజా అభిప్రాయం షాకిచ్చే విధంగా మారిందని తాజా సర్వే (Latest Survey) చెబుతోంది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైనా, తమకు ఉన్న ఓటు షేర్‌ను నమ్ముకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, కూటమికి చెందిన 71 మంది ఎమ్మెల్యేల (MLAs) పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత (Opposition) ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.

ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ 71 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల వారి నియోజకవర్గాల్లో 30 శాతం కన్నా తక్కువమంది మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు తేలింది. రియల్ ఎస్టేట్, లిక్కర్, మైనింగ్, సెటిల్మెంట్స్ వంటి అంశాల్లో ఎమ్మెల్యేలు అతి శ్రద్ధ చూపడం, కాంట్రాక్టర్ల (Contractors) నుంచి వసూళ్లు చేయడం, గ్రామీణ‌, అర్బ‌న్ ప్రాంతాల్లో వైరివ‌ర్గంపై దాడులు (Attacks), దౌర్జ‌న్యాలు (Atrocities) వంటి ఆరోపణలు ప్రజల్లో నెగటివ్‌ (Negative) ఫీలింగ్‌కు దారి తీసాయని సర్వే వివరించింది.

ప్రజా వ్యతిరేకతకు కారణాలు ఏమిటి? అని స‌ర్వే సంస్థ అధ్యాయ‌నం చేప‌ట్ట‌గా, ప్రజా సమస్యలపై దృష్టిలేకపోవడం, ప్ర‌జ‌ల నుంచి లంచాలు (Bribes) వ‌సూలు చేసే సంస్కృతి విప‌రీతంగా పెరిగిపోవ‌డం, ప్ర‌జాప్ర‌తినిధులు – పార్టీ కేడర్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌వ్వ‌డం, ఎమ్మెల్యేలు వ్యాపారాల్లో మునిగిపోవడం, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను బెదిరించి భ‌య‌పెట్ట‌డం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న అంశం తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇవి డేంజర్ బెల్స్ (Danger Bells) అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో జగన్ (Jagan) పాలనపై వ్యతిరేకత ఉంద‌ని ప్ర‌చారం చేసుకుని అధికారంలోకి వచ్చిన కూటమి, ఇప్పుడు తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటుంద‌ని రాజ‌కీయ నిపుణులు (Political Analysts) అంటున్నారు. ప‌ట్టుమ‌ని ప‌ది నెల‌ల కాలంలోనే ఏకంగా 71 ఎమ్మెల్యేల తీరు ప‌ట్ల వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త తీవ్రస్థాయికి చేరింద‌న్న లేటెస్ట్ స‌ర్వే కూట‌మిని ఆందోళ‌న‌లోకి నెట్టేసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌తీకార రాజ‌కీయాలకు కూడా దూరంగా ఉంటే మంచిద‌ని, క్షేత్ర‌స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ చేష్ట‌ల‌పై కూడా ఓ క‌న్నువేయాల‌ని సల‌హా ఇస్తున్నారు. ఇకపై సీఎం చంద్రబాబు (CM Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీసుకునే నిర్ణయాలే కూటమి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment