విషాదం.. యువ‌కుడి వేధింపులు తాళ‌లేక‌ బాలిక ఆత్మహత్య

విషాదం.. యువ‌కుడి వేధింపులు తాళ‌లేక‌ బాలిక ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మైనర్ బాలికలు (Minor Girls), యువతులపై (Young Women) జరుగుతున్న వరుస అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా (Anantapur District)లో రెండు దారుణ సంఘటనలు మరువకముందే, అన్నమయ్య జిల్లా రాయచోటి (Rayachoti) నియోజకవర్గంలోని మిట్టమీదిపల్లి (Mittamidipalli)లో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యకర్త (TDP Activist) తారకరత్న (Tarakaratna) అనే యువకుడి వేధింపులను తాళలేక, 15 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్యకు (Suicide)పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

తారకరత్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ముఖ్య అనుచరుడైన సంజీవరెడ్డి (Sanjeev Reddy) వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తగా ఫొటోలు(Photos), వీడియోలు (Videos) సోష‌ల్ మీడియా (Social Media)లో వైర‌ల్‌గా మారాయి. ఈ యువకుడు ప్రేమ పేరుతో బాలికను నిరంతరం వేధిస్తున్నారు. త‌న మాట విన‌క‌పోతే బాలిక తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. బాలిక తన బాధను తండ్రికి చెప్పినప్పటికీ, తారకరత్న ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మ‌రోసారి బెదిరించాడు. ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక, ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్న తండ్రి, కుటుంబ సభ్యులు ఈ ఘటనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ బాలిక పదో తరగతిలో 554 మార్కులు సాధించి, డాక్టర్ (Doctor) కావాలనే లక్ష్యంతో ఇంటర్మీడియట్‌లో చేరింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. జూన్ 13 నుంచి క్లాసులకు హాజరవ్వాల్సిన ఈ యువతి, తారకరత్న వేధింపుల కారణంగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘటనపై వైసీపీ(YSRCP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో బాలికల రక్షణ (Protection)పై ప్రశ్నలు లేవనెత్తింది. హోం మంత్రి (Home Minister) అనిత (Anitha), ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌ (AP Women’s Commission) ఈ సంఘటనపై వెంట‌నే స్పందించాల‌న్న డిమాండ్లు తీవ్ర‌మ‌య్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు, అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment