లోక్‌సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన

లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ముఖ్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో, తీవ్రమైన నిరారోపణలపై 30 రోజులకు పైగా అరెస్టులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఆటోమేటిక్‌గా పదవిని కోల్పోవాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలకు సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

అయితే, ఈ బిల్లులపై ప్రతిపక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరం రుజువయ్యేంతవరకు వ్యక్తిని నిర్దోషిగా చూడాలని రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక నిబంధనలకు ఈ బిల్లులు విరుద్ధమని వారు వాదించారు. ఈ బిల్లుతో అధికారుల చేతికి అపరిమిత అధికారం లభించి దేశం పోలీస్ స్టేట్‌గా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఈ బిల్లులు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.

లోక్‌సభలో బిల్లులపై తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జెపిసి) రిఫర్ చేశారు. ఈ సందర్భంగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య సభ వాయిదా పడగా, మళ్లీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment