---Advertisement---

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!
---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. టెండర్ల ప్రక్రియతో పాటు హడ్కో రుణం ఆధారంగా చేపట్టే నిర్మాణాలు సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

ప్రపంచ బ్యాంకు రుణంతో కొత్త పనులు
ప్రపంచ బ్యాంకు (World Bank) రుణంతో చేపట్టే పనులకు మరింత సమయం పట్టవచ్చని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ పనులు ప్రారంభమయ్యే వరకు కనీసం 45 రోజులు అవసరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సంకల్పంతో ముందుకు
అమరావతిని ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయడం ద్వారా అభివృద్ధికి దారితీస్తుంద‌ని మంత్రి నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment