నేడు అల్లు అర్జున్ విచారణ.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

నేడు అల్లు అర్జున్ విచారణ.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

Summarize with AI

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు BNS 35(3) కింద నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వివరణ ఇవ్వాలని సూచించారు.

ఈ ఘటనలో చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, నాలుగు వారాల వరకు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయకూడదు. కానీ, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ కొన‌సాగించ‌వ‌చ్చు అని కోర్టు తెలిపింది. దీంతో ఘ‌ట‌న‌పై వాస్త‌వాలు తెలుసుకునేందుకు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment