కాలేజీ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. హోలీ పండుగ రోజున డిగ్రీ చదువుతున్న అమ్మాయిలను ఎత్తుకొని బురదలో పడేసిన ఘటన తల్లిదండ్రులతో పాటు వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది.
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థినులను ఎత్తుకొని బురదలో పడేశాడు. అంతటితో ఆగకుండా, అమ్మాయిలపైకి కాళ్లతో బురద నీటిని చిమ్మాడు. విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ వెంకటపలి అనుచితంగా ప్రవర్తించిన తీరును వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడ అతి కాస్త వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం మండిపడుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా:
— Telugu Feed (@Telugufeedsite) March 15, 2025
కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటపతి అసభ్య ప్రవర్తన
హోలీ సందర్భంగా అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేసిన ప్రిన్సిపాల్
మహిళా విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ వెంకటపతి #AndhraPradesh pic.twitter.com/iR4XUe3Rta