స‌ర‌దాగా ఈతకెళ్లిన.. న‌దిలో కొట్టుకుపోయిన‌ లేడీ డాక్టర్

స‌ర‌దాగా ఈతకెళ్లిన.. న‌దిలో కొట్టుకుపోయిన‌ లేడీ డాక్టర్

Summarize with AI

కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు దురదృష్టవశాత్తు మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి హంపికి వెళ్లిన అనన్య, సరదాగా గడపాలని తుంగభద్ర నదిలో ఈతకు దిగింది. అయితే కొన్ని క్షణాల్లోనే నీటి ప్రవాహం ఊహించని విధంగా పెరిగింది. ఆ ప్ర‌వాహంలో ఆమె కొట్టుకుపోయింది.

స్నేహితులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా, ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో అది సాధ్యపడలేదు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు రంగంలోకి దిగి అనన్య రావు మృతదేహాన్ని తుంగభద్ర నదిలో గుర్తించి వెలికితీశారు.

ఈ వార్తతో అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ కుమార్తె అయిన అనన్య హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆసుపత్రి వర్గాలు, ఆమెను వ్యక్తిగతంగా కలిసిన వారు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లే వారు, ముఖ్యంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment