హైదరాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హిందూ సంఘాలను సమాచారం అందించారు. హిందూ ధర్మ పరిరక్షణ సంఘాల ప్రతినిధులు వెంటనే ఆలయానికి చేరుకుని ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో త్వరలోనే బయటపడే అవకాశముందని వెల్లడించారు.