సచివాలయంలోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో ఫైల్స్ క్లియరెన్స్పై సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ఫైల్స్ క్లియర్ చేయడంలో తొలిస్థానంలో ఫరూఖ్, ఆఖరిస్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు.
తాను మాత్రం ఆరో స్థానంలో ఉన్నానని సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ లో రెండు , మూడు స్థానాల్లో కందుల దుర్గేష్ , కొండపల్లి, నాలుగు, ఐదు స్థానాల్లో మనోహర్, బాల వీరాంజనేయ స్వామి, ఏడు, ఎనిమిది స్థానాల్లో సత్యకుమార్, లోకేష్, తొమ్మిది, 10 స్థానాల్లో బీసీ జనార్ధన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఉన్నారని, 11,12 స్థానాల్లో సవిత, కొల్లు రవీంద్ర, 13,14 స్థానాల్లో గొట్టిపాటి రవి, నారాయణ, 14,16 స్థానాల్లో టీజీ భరత్ , ఆనం రామనారాయణరెడ్డి, 17,18 స్థానాల్లో అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, 19,20 స్థానాల్లో గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత ఉన్నారు.
ర్యాంకింగ్స్లో వెనకబడిన చంద్రబాబు, లోకేశ్
