భారత చెస్ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు చెస్ దిగ్గజం ఆర్. ప్రజ్ఞానంద. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025లో ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్లోని విజ్క్ ఆన్ జీ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నారు ప్రజ్ఞానంద్.
ఈ టైటిల్ను గెలుచుకొని విశ్వనాథన్ ఆనంద్ సరసన ప్రజ్ఞానంద చోటు సంపాదించుకున్నాడు. ఈ టైటిల్ నెగ్గిన (2006లో విశ్వనాథన్ ఆనంద్) రెండో భారతీయుడుగా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఇక టాటా స్టీల్ ఛాలెంజర్స్-2025 విజేతగా వియత్నాం గ్రాండ్మాస్టర్ థాయ్ దై వాన్ గుయెన్ విజయం సాధించారు.