అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాకీ నేర్చుకునేందుకు వచ్చిన బాలికపై సీనియర్ హాకీ ప్లేయర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి పట్టణం గాంధీనగర్కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక హాకీ నేర్చుకునేందుకు రాజీవ్ స్పోర్ట్స్ గ్రౌండ్కు వెళ్లింది. సమీపంలోని ఉలక్పేట ప్రాంతానికి చెందిన మల్ల రూపేశ్ హాకీ ప్లేయర్. అదే గ్రౌండ్లో సాధన చేస్తుంటాడు.
హాకీ నేర్చుకునేందుకు ప్రతిరోజూ గ్రౌండ్కు వచ్చే ఆ బాలికపై రూపేశ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దారుణాన్ని బాలిక వెంటనే తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తల్లి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ కె.సావిత్రి మీడియాకు వివరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కేసును పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యం ఏదో ఒక చోట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు విపరీతమయ్యాయి. గత వారం పెనమలూరులో ఐదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండ్రోజుల క్రితం కడపలోని ఓ ఆర్టీసీ మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి ఘటన వెలుగుచూసింది. ఇలా ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
దిశ యాప్ కనుమరుగు..
గత ప్రభుత్వ హయాంలో దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ పోలీస్ స్టేషన్లను తొలగించారు. దిశ యాప్ పేరుమార్చారు. యాప్ పేరు మార్చినా జనాల్లో పెద్దగా అవగాహన కూడా లేదు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో పదే పదే చెప్పినప్పటికీ.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అరాచకాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అనకాపల్లిలో 13 ఏళ్ల హాకీ ప్లేయర్పై జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.