కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తాప‌డి విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తి మృతిచెంద‌గా, మ‌రో 18 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్ర‌యాణికుల‌తో విశాఖ‌ప‌ట్నం నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరింది. మార్గ‌మ‌ధ్య‌లో రాజ‌మండ్రి స‌మీపంలోని కాతేరు వ‌ద్ద బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ప్రమాదంలో విశాఖ‌కు చెందిన యువ‌తి మృతిచెంద‌గా, మ‌రో 18 మంది ప్ర‌యాణికుల‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు.

Join WhatsApp

Join Now

Leave a Comment