లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్‌ కాలేజీ లండన్‌లో ఎంఎస్‌, ఫైనాన్స్‌ కోర్సును పూర్తిచేసి, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 16న కింగ్స్‌కాలేజ్‌ లండన్‌లో గ్రాడ్యుయేష‌న్ డే జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమంలో జగన్‌ దంపతులు పాల్గొంటారు. ఈ నెలాఖరున జగన్‌ లండన్‌ నుంచి తిరుగు ప్రయాణం అవుతారని వైసీపీ కేంద్ర కార్యాల‌యం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment