కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి ముందే శుభ‌వార్త‌!

కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి ముందే శుభ‌వార్త‌!

Summarize with AI

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకారులపై(Protesters) నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను(FIRs) ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం(Central Government) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఆర్టికల్‌ 142 కింద ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసేందుకు పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం.

కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై(Petition) రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అత్యవసరంగా విచారించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India – CJI)అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థులపై (Students) నమోదైన కేసులను ఎత్తివేస్తామని గతంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) సెప్టెంబర్‌ 5న ర్యాలీకి పిలుపునిచ్చింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని CJP కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న జరగనున్న ర్యాలీకి(Rally) ముందే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల ఆందోళనను శాంతింపజేసేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టిందన్న చర్చ మొదలైంది.

ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కేంద్రం కోరుతోంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విద్యార్థులపై కేసుల విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని CJP కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న తలపెట్టిన ర్యాలీకి ముందు కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment