నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leak) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్షీట్ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. సీబీఐ(CBI) ఛార్జ్షీట్ను (Charge Sheet) ఢిల్లీ (Delhi) రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పరిగణనలోకి తీసుకుంది. నిందితుల నమోదైన ఆరోపణలపై న్యాయస్థానం రేపు వాదనలు విననుంది. ఎన్టీఏకు (NTA) చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే పేపర్ లీక్ చేసినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఛార్జ్షీట్లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు సేకరించింది.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్వహించిన నీట్ పేపర్ లీకైంది. దీంతో ప్రభుత్వం ఎగ్జామ్ను రద్దు చేసింది. అనంతరం మరో ఎగ్జామ్ను నిర్వహించింది. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థులంతా ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక నీట్ పరీక్షను మరోసారి నిర్వహించింది.








