13 కిలోల బంగారంతో జంప్!.. హైదరాబాద్‌లో రూ.21 కోట్ల ఘరానా మోసం

13 కిలోల బంగారంతో జంప్!.. హైదరాబాద్‌లో రూ.21 కోట్ల ఘరానా మోసం

Summarize with AI

హైదరాబాద్‌లో (Hyderabad) భారీ బంగారం మోసం (Gold Fraud) వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జువెలరీ షాపులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికిన ఓ వ్యక్తి, పలువురు వ్యాపారులను కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. నితిన్ (Nithin) అనే వ్యక్తి ప్రముఖ నగల వ్యాపారులతో పరిచయాలు ఉన్నట్లు చెప్పి వారి విశ్వాసాన్ని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివిధ జువెలరీ (Jewellery) షాపుల నుంచి 13 కిలోలకుపైగా బంగారాన్ని తీసుకున్న అతడు, తిరిగి చెల్లించకుండా పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసం విలువ సుమారు రూ.21 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై మోసపోయిన జువెలరీ షాపు యజమానులు సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) (City Central Crime Station – CCS) పోలీసులను ఆశ్రయించారు. నితిన్‌పై ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బంగారాన్ని ఎక్కడ విక్రయించాడు, ఆ మొత్తాన్ని ఎలా వినియోగించాడు అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనతో నగల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment