ఎండలకు బ్రేక్.. దేశంలోకి దూసుకొస్తున్న రుతుపవనాలు

ఎండలకు బ్రేక్.. దేశంలోకి దూసుకొస్తున్న రుతుపవనాలు

Summarize with AI

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండల (Heatwaves) నుంచి ప్రజలకు (People) నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) భారీ ఉపశమనాన్ని అందిస్తున్నాయి. కేరళలో(Kerala) ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా విస్తరిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో (Southern States) విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలకు విస్తరించిన ఈ పవనాలు రాబోయే రోజుల్లో మరింత ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షాలు(Rains) చల్లదనాన్ని తీసుకొస్తున్నప్పటికీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, పట్టణాల్లో జలమయం పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో మాత్రం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. పశ్చిమ అల్లకల్లోలం ప్రభావంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మళ్లీ వడగాల్పుల ముప్పు పొంచి ఉందని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అంచనా వేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment