వందేభారత్‌ భోజనంలో షాక్.. పెరుగులో పురుగులు, భారీ జరిమానా

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతపై సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నా నుంచి టాటానగర్‌కు వెళ్తున్న ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంది.

వైరల్ వీడియోతో బయటపడిన ఘటన
మార్చి 15న ప్రయాణిస్తున్న రితేష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడికి భోజనంలో భాగంగా పెరుగు వడ్డించారు. అయితే అందులో పురుగులు పాకుతున్నాయని గమనించిన ఆయన వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రైల్వే అధికారులు తనిఖీ చేసినప్పుడు కూడా ఆహారంలో పురుగులు ఉన్నట్లు స్పష్టమైంది. అయితే అక్కడి సిబ్బంది అవి పురుగులు కావని, కేసరి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీపై పది లక్షల రూపాయల జరిమానా విధించింది. అలాగే ఆహార సేవలు అందిస్తున్న సంస్థపై యాభై లక్షల రూపాయల జరిమానా విధిస్తూ వారి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment