రాధాకృష్ణ రాతలపై రచ్చ.. పాత కాంగ్రెస్ మంత్రుల రహస్య భేటీ?

రాధాకృష్ణ రాతలపై రచ్చ.. పాత కాంగ్రెస్ మంత్రుల రహస్య భేటీ?

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆంధ్రజ్యోతి పత్రిక (Andhra Jyothy Newspaper) అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) రాస్తున్న కాలమ్స్‌ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. వార్తల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లోని మంత్రులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)పై ఇటీవల రాధాకృష్ణ రాసిన కథనాలు పెద్ద దుమారం రేపాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా రహస్య భేటీ (Secret Meeting) నిర్వహించినట్లు సమాచారం. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మీడియా కథనాల వెనుక ఉన్న కారణాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరిగిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధ్రువీకరించారు.

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్ భవన్‌లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే కారులో ప్రజా భవన్‌లోని భట్టి నివాసానికి చేరుకుని ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నారు.

ఇటీవల బొగ్గు స్కాం అంశంపై చెలరేగిన వివాదం, భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని ప్రచురితమైన కథనాల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పత్రికా సమావేశంలో భట్టి విక్రమార్క తనపై వస్తున్న కథనాల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం రాధాకృష్ణ ఈ రాతలు రాస్తున్నారు? అనే ప్రశ్నలను బహిరంగంగా లేవనెత్తారు. భట్టి వ్యాఖ్యల అనంతరం జరిగిన ఈ మంత్రుల రహస్య భేటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులంతా గతంలో ఏదో ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలు ఎదుర్కొన్న వారే కావడం గమనార్హం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలకు, మీడియా వర్సెస్ ప్రభుత్వ వివాదానికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment